– గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా?
– గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో. అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నది. ఎలాగూ గెలిచేది లేదని.పేజీలకు పేజీలు రాశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. 420 మేనిఫెస్టో ను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చింది. జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తమని మేనిఫెస్టోలో పెట్టారు.
ఈ ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్నదా..రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే.బి ఆర్ ఎస్ మేనిఫెస్టో ను కాంగ్రెస్ కాపీ కొట్టింది.అప్పులు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్. రెండేళ్లు అరోగ్య మంత్రిగా చేశావ్.అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్.గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా? ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావ్.అన్నం పెట్టిన కేసీఆర్ ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు.