– టార్గెట్ చంద్రబాబుకు సహకరించే అధికారులకు రివార్డులు, అవార్డులు…. లేని వారికి బెదిరింపులు
– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టాలనే టార్గెట్తో జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డిలా ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో దేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయడం లేదని వర్ల అన్నారు. చంద్రబాబు నాయుడిపై జగన్ మోహన్ రెడ్డి పెడుతున్న కేసుల్లో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు.
టార్గెట్ చంద్రబాబు అనే నినాదంతో పనిచేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు. అలాంటప్పుడు ఆయనను జైల్లో ఎలా పెడుతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటకు వస్తే వైసీపీ వారు ఒంటిమీద చలిచీమలు పాకినట్లు ఫీల్ అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి చెంచాగిరి చేసే అధికారులు ఉండొచ్చు…కానీ, న్యాయస్థానాలను మాత్రం జగన్ రెడ్డి మభ్యపెట్టలేరు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదటి మూడు వేల కోట్ల అవినీతి అన్నారు…తర్వాత 3 వందల కోట్లు అన్నారు..చివరికి రూ.27 కోట్లు అని అభాసుపాలయ్యారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టని ఇన్నర్ రింగు రోడ్డు కేసులో అవినీతి అంటూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడిపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు ఏజీ సమర్ధించడం లేదు కాబట్టే ఆయనను ప్రక్కన పెట్టారు.
సిఐడీ తప్పుడు కేసులకు అడ్వకేట్ జనరల్ తలవంచలేదు కాబట్టే ఆయనను వైకాపా ప్రభుత్వం ప్రక్కన పెట్టింది. వైకాపా ప్రభుత్వ దొంగకేసులను ఏజీ శ్రీరాం సమర్ధించడం లేదు. అందుకే అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కేసులు వాదిస్తున్నారు. పొన్నవోలు లీగల్ శాన్క్టిటీ లేని వ్యక్తి. టార్గెట్ చంద్రబాబు అన్న జగన్ రెడ్డి విధానానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాబేదారులా పనిచేస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజాయితీపరులైన అధికారులను బయపెడుతూ… జగన్ మోహన్ రెడ్డి తప్పుడు కేసులను సమర్ధిస్తున్న అధికారులకు అవార్డులు, రివార్డులు ఇస్తోంది.
సాధారణంగా ఆధారాలు లేకుండా పోలీసులు కేసులు పెట్టరు. జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు బయపడి, ఆయన ఇస్తున్న తాయిలాలకు ఆశపడే అధికారులు చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. చంద్రబాబునాయుడిపై జగన్ మోహన్ రెడ్డికి ఎందుకంత ధ్యేషం? చంద్రబాబునాయుడిపై కక్షసాధించడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ న్యాయవ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు.
దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడే. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జగన్ మోహన్ రెడ్డి విధానమైన ‘టార్గెట్ చంద్రబాబు’కు వత్తాసు పలకొద్దని అధికారులను హెచ్చరిస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి తాబేదారుల్లా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతీ అధికారి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి మిగిలిన ఈ మూడు, నాలుగు నెలలైన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా.