లగ్గం’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల
రచన -దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంభరాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది పెళ్లి కల్చర్ ఫ్యామిలీ డ్రామా
ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమంలో సాయి రోనక్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ ఆర్టిస్టులు రోహిణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ – మాటలు స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్:కృష్ణ సాహిత్యం: కాసర్ల శ్యామ్. సంజయ్ మహేశ్ వర్మ కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.