Mahanaadu-Logo-PNG-Large

యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ ఇవ్వగలడా?

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్‌లతో కూడిన ట్వీట్ల థ్రెడ్‌తో మేకర్స్ ఉదయం నుండి దీని కోసం చాలా ఆసక్తిని పెంచారు. రిలీజ్ ట్రైలర్ రవితేజ ఫెరోషియస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. టెర్రిఫిక్ డైలాగ్‌లు, దావ్‌జాంద్ అద్భుతమైన బిజిఎమ్ తో అదరగొట్టింది. టేకింగ్ టాప్ క్లాస్ గా వుంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్ గా వుంది.
‘వచ్చాడంటే మోతర, విధ్వంసాల జాతర’ అనే లైన్స్ సినిమాలోని మాస్ మహారాజా పాత్రను వివరిస్తూ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తున్నాయి. రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. విడుదలకు ముందు అభిమానులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈగల్ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.
ఇక మరి ఇటీవల రవితేజ సినిమాలు కాస్త అంతంత మాత్రంగా ఆడుతున్నాయని చెప్పాలి. మంచి హిట్‌ కొట్టి చాలా కాలమయిందనే చెప్పవచ్చు. మరి ఈగల్‌ ఏ విధంగా ప్రేక్షకుల్లో మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి మరి. స్టోరీ ఎలా ఉన్నా కనీసం మాస్‌ ఆడియన్స్‌నైనా థియేటర్ లో కూర్చోబెట్టగలడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.