ఆయనో జిల్లా కి (కలెక్టర్).. ఓ వైపు జిల్లా బాధ్యతలు.. మరోవైపు అయ్యప్ప దీక్షతో ప్రజలకు దగ్గరగా సామాన్యుడిలా…హాట్స్ ఆఫ్ కలెక్టర్ సార్… అంటున్నారు..జిల్లా ప్రజలు. భగవంతుడు ముందు అందరూ సమానమే అనే విధంగా ఓ మంచి మెసేజ్ ను కలెక్టర్ తీసుకువెళ్లారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిజాయితీ గల అధికారగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఆయన ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు.
ఎన్నో నియమాలతో ఎంతో నిష్టగా చేయవలసిన దీక్ష. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు, టెన్షన్లు ఉంటాయి. బాధ్యతల మధ్య దీక్ష చేపట్టడం ఎంతో కష్టమైన విషయం.. కానీ ఆయన తన రెండు బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ ముందుకు వెలుతున్నారు.
అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన భక్తి అనేది మనలోని సద్గుణాలను మేల్కొలుపుతోందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అంటున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప దీక్ష చేపట్టిన అయన ఏలూరు రూరల్ దొండపాడు శ్రీ బాల అయ్యప్ప క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి మండల దీక్ష స్వాములకు ద్వాదశి 12వ వార్షిక దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ అయ్యప్ప స్వామి మండల అధ్యక్ష స్వాములకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. ఆ స్వాములతో పాటు కలసి ఆయన భోజనం చేశారు.
ఓ మండల స్థాయి అధికారికి సైతం ఏదైనా సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ముందు కూర్చోవాలన్న, మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక సామాన్యులైతే ఆమడ దూరంలోనే ఉండిపోతారు. అలాంటిది ఇక్కడ డైరెక్ట్ గా ఓ జిల్లా కలెక్టర్ ఓ సాధారణ వ్యక్తిలా అయ్యప్ప స్వాముల బిక్ష కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి అందరికీ స్వయంగా బిక్ష వడ్డిస్తూ, వారితో కలిసి భోజనం చేయడంతో తోటి స్వాములు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిబద్ధత పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.