రుణాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో మోసం పోలీసుస్టేషన్లో బాధితుల ఫిర్యాదు గుడివాడ, మహానాడు : కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి పరారైన ఘటన వెలుగుచూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పి స్తానంటూ లీలావతి అనేక మందిని నమ్మించింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ […]
Read Moreఅర్ధరాత్రి దాటాక హైకోర్టు విధులు
350కి పైగా కేసుల విచారణ ముగ్గురు న్యాయమూర్తుల రికార్డ్ హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా తెలంగాణ హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్తో పాటు లంచ్ మోషన్ పిటిషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అర్ధరాత్రి సుమారు ఒంటిగంట వరకు బెంచ్పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో […]
Read Moreచార్ధామ్ యాత్రలో 52 మంది మృతి
ఛత్తీస్గఢ్ : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 50 మందికి పైగా భక్తులు మృతిచెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్శంకర్ తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, నలుగురు బద్రీనాథ్, 23 మంది కేదార్నాథ్లో మరణించారని వివరించారు. 50 ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి […]
Read Moreఏపీకి ‘రెమాల్’ తుఫాన్ హెచ్చరిక
అమరావతి: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళా ఖాతంలో తుఫాన్గా మారనుంది. దీనికి ‘రెమాల్’ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, […]
Read Moreపిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు
అమరావతి : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయ త్నం కేసు నమోదైంది. ఈనెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పిన్నెల్లి దాడి చేశాడని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు నమోదు చేశారు.
Read Moreయూపీపీఎస్సీ చైర్మన్కు చంద్రబాబు లేఖ
అధికారులకు పదోన్నతుల నిర్ణయంపై సమీక్షించాలి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సీఎస్ నిర్ణయం సరికాదు అమరావతి, మహానాడు : రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ప్రతిపాదనలు పంప డం నిబంధనలకు విరుద్ధమని, జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని పేర్కొంటూ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని యూపీపీఎస్పీ చైర్మన్కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు […]
Read Moreడీజీపీకి టీడీపీ నేతల వినతిపత్రం
అమరావతి, మహానాడు : పోలీసుల సమస్యల పరిష్కారించాలని టీడీపీ నాయకులు మహ్మద్ ఇక్బాల్, ఎం.ఎస్.బేగ్ శుక్రవారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పోలీసులకు తగిన బాధ్యతలు అప్పగించాలని, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులకు అలవెన్స్ లు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బందోబస్తులో పాల్గొంటున్న పోలీసు లు అనేక సమస్యలతో […]
Read Moreబిగ్ బాస్కెట్లో గడువు తీరిన వస్తువులు
అధికారుల తనిఖీల్లో గుర్తింపు తాత్కాలికంగా లైసెన్స్ రద్దు హైదరాబాద్: కొండాపూర్ మసీదు బండలోని బిగ్ బాస్కెట్ గోడౌన్లో శుక్రవారం తనిఖీల్లో గడువు తీరిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించా రు. చికెన్ మసాలా, చికెన్ సాసేజ్లు, పిజ్జా చీజ్, పన్నీర్, ఐస్క్రీమ్లు, పాల సీసా లు, థిక్ షేక్స్, ఇతర వస్తువులను కనుగొన్నారు. నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు తాత్కాలికంగా లైసెన్సును రద్దుచేశారు. వినియోగదారులు వస్తువు లపై గడువు తేదీని […]
Read Moreబూతులు కావాలా…బిట్స్ ఫిలాని కావాలా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం రాకేష్రెడ్డి అవకాశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ ఖమ్మం, మహానాడు : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్లో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని స్పష్టంగా వివరించారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఆయన ఉన్నత విద్యావంతుడు, బిట్స్ ఫిలానిలో గోల్డ్ మెడలిస్ట్ […]
Read Moreఅవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
ఆరోపణలు వాస్తవం కాదంటే సమాధానం చెప్పాలి భయపడేది లేదు..ప్రజల కోసం దేనికైనా సిద్ధం రేవంత్, ఉత్తమ్పై బీజేపీ ఎమ్మెల్యేల ధ్వజం హైదరాబాద్, మహానాడు : ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయి […]
Read More