– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
జగన్ రెడ్డి కి ఓటమి భయం వెంటాడుతోంది. సొంత నియోజకవర్గం పులివెందుల లో టిడిపి బలపడుతుండటం, తనపై ప్రజా వ్యతిరేకత పెరగడం ను ఓర్వలేకపోతున్నారు.సొంత నియోజక వర్గం పులివెందుల లో బిటెక్ రవి చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోంది.
అరెస్ట్ చేస్తున్నారో… కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, వచ్చింది పోలీసులో , కిడ్నాపర్లో తేల్చుకోలేని దుస్థితి రాష్ట్రం లో నడుస్తోంది.అరెస్ట్ చేశారా…కిడ్నాప్ చేశారా తెలీక బీటెక్ రవి కుటుంబ సభ్యులు ఆందోళన కు గురై ఎస్పీ, డీఎస్పీ లకు ఫోన్ లు చేస్తే స్పందన కరువైంది.బీటెక్ రవి పై 10 నెలల కిందట నమోదు అయిన బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ కేసు గా మారడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు బహిరంగపర్చాలి.
టిడిపి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం, వాటిని నాన్ బెయిలబుల్ కేసులు గా మార్చి అరెస్ట్ చేయడం పోలీసులకు సర్వ సాధారణం అయిపోయింది. బీటెక్ రవి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాను. ఆయన పై పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.