Mahanaadu-Logo-PNG-Large

బీజేపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ.. ఏపీ కోసం ప్లాన్‌

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలె పద్మ విభూషన్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఆయనను ప్రస్తుతం మరో ఆఫర్‌ కూడా వరించేటట్లే ఉంది. ఇంతకీ ఏంటా ఆఫర్‌ ఏమా గోల అనుకుంటున్నారా.. అదేనండీ ఏపీలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు సినీ గ్లామర్​ను రంగంలోకి దింపాలని భావిస్తున్నది. ఈ నేమొపథ్యంలోనే ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ బీజెపీ కొత్త పుంతలు మొదలుపెట్టింది. ఏపీలో బీజేపీ అనేది ఎక్కడా కనిపించకపోయే సరికి ఎలాగోలా తమ ఎనికిని చాటుకోవడానికి రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది. ఏపీ సీఎం జగన్​ వచ్చే ఎన్నికలకు సింగిల్ గానే బరిలోకి దిగుతున్నారు. ఓవైపు జగన్‌ను గద్దె దింపాలనే విధంగా టీడీపీ, జనసేనలు జత కడితే మరోవైపు కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుతున్నారు. ఈ సమయంలోనే బీజేపీ “మెగా” స్కెచ్ సిద్దం చేసింది.

దీంతో గతంలో 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీసీ నినాదంతో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. ఇటు ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకం. బీజేపీ ఇప్పుడు ఇదే అంశం ఆధారంగా కొత్త లెక్కలకు సిద్ధమైంది.

రాజ్యసభకు చిరంజీవి
బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇటీవల పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన విషయం సమతమే. పవన్ తో పొత్తు ద్వారా కాపు మెజార్టీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. అదే విధంగా అన్నయ్య చిరంజీవికి కూడా పద్మవిభూషణ్‌ అవార్డునుప్రకటించి ఓ వర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నమని చెప్పాలి. అయోధ్య రామాలయం ద్వారా కొన్ని వర్గాలకు అతీతంగా తమకు మద్దతు పెరిగినట్లు అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఇక, ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు మరో పక్క ప్రచారం సాగుతోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వటం ద్వారా కొత్త వ్యూహానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. పవన్ తో పొత్తు కొనసాగిస్తూ..చిరంజీవికి రాజ్యసభకు పంపటం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. మరి..బీజేపీ ఆఫర్ ను సినిమాల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్న చిరంజీవి ఆంగీకరిస్తారా అనే అనుమానాలు మరోపక్క వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో మంత్రిపదవి అనుభవించిన చిరంజీవి.. రాజ్యసభకు ఒకే అంటారని భావిస్తున్నారు. దీంతో బీజెపీ ఏపీలో కూడా తమ హవాని పెంచుకోవచ్చు.