పార్లమెంట్‌ లో వరదనీరు

న్యూఢిల్లీ, మహానాడు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్‌ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనంలో పలికి వర్షపు నీరు చేరి ఇబ్బంది కరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. భవనం పైకప్పు నుంచి కూడా నీరు లీకైన వీడియోను కాంగ్రెస్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ షేర్‌ చేశారు. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.