అయ్యప్పదీక్ష స్వాములు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
+ప్రత్యేక బస్సులు లేక దర్శనానికి స్వాముల ఇక్కట్లు
– అనగాని సత్యప్రసాద్
అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరస్తోంది. దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అయ్యప్పస్వామి దర్శన భాగ్యం లేక స్వాములు, భక్తులు నిరాసతో ఉంటున్నారు. ప్రభుత్వంగానీ, దేవాదాయశాఖ మంత్రిగానీ కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు. భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ప్రత్యేక చర్యలు లేకపోవడంతో వేలాది మంది స్వాములు, భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరిగి వస్తుండటం బాధాకరం. రద్దీ ఉన్న సమయంలో రవాణా బస్సుల కేటాయింపుతో పాటు, సంబంధిత అధికారులతో గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడి సమస్య పరిష్కరించేవారు. వైసీపీ సభలకు ప్రత్యేక బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించడంపై ఉన్న శ్రద్ధ..అయ్యప్ప స్వాములకు ప్రత్యేక బస్సులు కేటాయించడంపై లేదు. ఒక ప్రత్యేక అధికారిని నియమించి శబరిమల వెళ్లివచ్చే భక్తులపై శ్రద్ధ చూపించారు. రాష్ట్రం నుండి ప్రత్యేక రైళ్లను కూడా ఆనాడు ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బితీసే విధంగా ప్రభుత్వ ప్రవర్తన ఉంటోంది. ఆయా రాష్ట్రాల భక్తులకు సంబంధించి తమ రాష్ట్రాలు చూసుకుంటున్నప్పుడు…ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి..అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తులు సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. రాష్ట్రం నుండి అనేక వ్యవప్రయాసాలతో శబరిమల వెళ్లి దర్శన భాగ్యం లేక వెనుదిరిగి వస్తున్నా ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం దేనికి సంకేతం.? శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది గాయాలపాలైనా ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఎలక్షన్..సెలక్షన్..కలెక్షన్ పై ఉన్న శ్రద్ధ..ప్రభుత్వానికి అయ్యప్ప భక్తులపై లేదు. మకర సంక్రాంతి లోపైనా ప్రభుత్వం రవాణా సౌకర్యంపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధికారంలోకి రాగానే శబరిమల వెళ్లే భక్తుల సమస్యలను పరిష్కరిస్తాం.
*Sd-*
*అనగాని సత్యప్రసాద్*
*శాసనసభ్యులు, టీడీపీ*