మహానాడు, విశాఖపట్నం: తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా బాధ్యతలను నిర్వహించిన నందమూరి లక్ష్మీపార్వతికి గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ ఆచార్యులు హోదాను ఉప సంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిశోర్బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో గౌరవ ఆచార్యులు హోదాతో పాటు విశ్వ విద్యాలయ పరిశోధకులకు మార్గ దర్శకం అందించే బాధ్యత కూడా ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.