Mahanaadu-Logo-PNG-Large

‘పోచర్‌’ చూస్తే చేతుల్లో వణుకు పుట్టింది -మహేశ్‌

టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌బాబు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాకుండా ఖాళీ సమయంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. చూడటమే కాదు ఆ సినిమా కథ తనకు నచ్చితే అది ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ నచ్చితే దాన్ని మెచ్చుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ‘పోచర్’ అనే వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేరళ అడవుల్లో ఏనుగులను వేటాడే రాకెట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ కు ‘ఢిల్లీ క్రైమ్’ ఫేమ్ డైరెక్టర్ రిచీ మెహతా ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను చూసిన మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు.

‘ఎవరైనా ఇలా ఎలా చేయగలరు? మానవత్వం లేదా? వాళ్ల చేతులు వణకలేదా? క్రైమ్ థ్రిల్లర్ ‘పోచర్’ వెబ్ సిరీస్ ను చూసిన తరువాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.