– వైయస్ తో స్నేహం గురించి చంద్రబాబు చాలా బాగా చెప్పారు
-TDP జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల
-తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల
వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది.
వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తం…రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి.రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం.నాకు భాద్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తాం.
చంద్రబాబు ను కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాం.ఇక్కడ కేటీఆర్,హరీష్,కవిత గారికి కూడా పంప
రాజకీయాలు అన్నది జీవితాలు కాదు.రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పని చేయాలి
పండుగకో,లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాం. చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు…నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు. వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబు ను పిలిచారు. మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు..దీవించారు.