విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని ఇటీవలే ఖరారు చేసారు. మిగతా తారాగణం ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. విజయ్ కి జోడీగా తొలుత ఎంపిక చేసింది శ్రీలీలని అని తెలిసింది. ఫస్ట్ డే లెక్కలు ఇలా.. ఆమెతో అగ్రిమెంట్ కూడా జరిగిందిట. కానీ అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. డేట్లు సర్దుబాటు కావడం లేదనే రీజన్ చెప్పి బయటకు వచ్చేసిందంటున్నారు. కానీ శ్రీలీల తప్పుకోవడానికి అసలు కారణం డేట్లు కాదని….దర్శకుడి కండీషన్లు ఆమెకు నచ్చకే ఎగ్జిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో హీరోతో కొన్ని ఇంటిమేట్ సీన్లు…లిప్ లాక్ లున్నాయట. వాటి గురించి గౌతమ్ ముందుగానే వివరించినా తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదన్న ఆసక్తిని వ్యక్తం చేసిందిట. వీలైతే వాటి నుంచి మినహాయింపు ఇస్తే నటిస్తానని లేదంటే స్కిప్ అవుతానని చెప్పేసిందట. సన్నివేశాల డిమండ్ మేరకు కచ్చితంగా అలాంటి సన్నివేశాలుంటాయని సూచించడంతో శ్రీలీల ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. భాగ్య శ్రీని కూడా ఈ మధ్యనే ఎంపిక చేసారు. వాస్తవానికి విజయ్ తో ప్రాజెక్ట్ లాక్ అయి చాలా కాలమవు తుంది.