సుహాస్‌ మంచి ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌- అడవిశేష్‌

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో అడివి శేష్ మాట్లాడుతూ – ఈ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరూ డ్రీమర్స్. ఒక కల గని దాన్ని సాధించుకున్న వాళ్లు. ఆ సంతోషం వాళ్లలో కనిపిస్తోంది. సుహాస్ నాకు ఛాయ్ బిస్కట్ లో వీడియోలు చేస్తున్నప్పటి నుంచి తెలుసు. తను గొప్ప స్థాయికి వెళ్తాడని చెప్పగలను. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులో చాలా అరుదుగా ఉంటారు. సుహాస్ నెక్ట్ ఏ స్థాయికి వెళ్తాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా ఈవెంట్ కు గెస్ట్ గా రావాలి. సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ ట్రైలర్ ను పది సార్లు చూశా. అంత బాగా నచ్చింది. శరణ్య గారు, శివానీ , సుహాస్ పోటీపడి నటించారు. ఎవరూ తక్కువ కాదు అనిపించింది. గీతా ఆర్ట్స్ సంస్థలో నేను సినిమా చేయాలనుకుంటున్నా. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. డైరెక్టర్ దుశ్యంత్, నిర్మాత ధీరజ్, బన్నీ వాస్ గారు, ఎస్ కేఎన్..ఇలా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఫిబ్రవరి 2న మనమంతా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా బ్యాండ్ మోగించాలి. అన్నారు.