ప్రపంచ వేదికపై మన తెలంగాణ

ప్రపంచ వేదికపై మన తెలంగాణ
-దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​
వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​* ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన
ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది.
మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​…
మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​,
ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్..  విభిన్న రంగాల
మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​ డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు..
’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’,
‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి  గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు​
పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి.
భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. *మీ కోసమే తెలంగాణ* అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది.  సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి  డేటా సైన్స్​ జోడీ..  ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత..  పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లిష్​ కోట్స్​తో ప్రదర్శించారు.