ప్రపంచ వేదికపై మన తెలంగాణ
-దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్
వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్* ట్యాగ్ లైన్తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన
ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది.

మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్…
మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్,
ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్.. స్కైరూట్ ఏరోస్పేస్.. విభిన్న రంగాల
మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు..
’ఇన్ వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’,
‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు
పెవిలియన్కు స్వాగతం పలుకుతున్నాయి.

భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. *మీ కోసమే తెలంగాణ* అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్ జోడీ.. ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లిష్ కోట్స్తో ప్రదర్శించారు.