Mahanaadu-Logo-PNG-Large

సివిల్స్ మెయిన్స్‌కు 13,090 మందికి అర్హ‌త‌

ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి అఖిల భార‌త స‌ర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఈ ఏడాది ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌కు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు హాజరు కాగా… సివిల్స్ మెయిన్స్‌కు కేవ‌లం 13,090 మంది మాత్ర‌మే అర్హ‌త సాధించారు. సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి సెప్టెంబ‌ర్ 16 నుంచి 21 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది.