Mahanaadu-Logo-PNG-Large

టీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని

కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ

నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం,

రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు

రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం

సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ

గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం

చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ చంద్రబాబు

కంటే భారీ మెజారితో అక్కడ పసుపు జెండా ఎగరవేశారు.