Mahanaadu-Logo-PNG-Large

నేడు సీనియర్ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం..

ఢిల్లీ పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు, పదవులపై వారితో చర్చించనున్నారు. కాగా రేపు మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు తమకు నాలుగు కేంద్ర మంత్రుల పదవులు, లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి. మరి చంద్రబాబు అడిగిన డిమాండ్లపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడలి.