ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

– ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు

– ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు

– చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది

– ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు – ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి

– నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను

– నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు – కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు

– అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు

– ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను – ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది

– ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి – అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి

– ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి

– నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది

– ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా

– ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి : టీడీపీ అధినేత చంద్రబాబు