-ఖచ్చితమైన ఫలితాలను వేగవంతంగా ప్రకటించాలి
-ఫలితాల వెల్లడిలో ఏ మాత్రం జాప్యం చేయొద్దు
-ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి
-విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి
-పాస్ లేకుండా ఎవరినీ అనుమంతించొద్దు
-లెక్కింపు పూర్తయ్యాక సీల్ వేసి భద్రపరచాలి
-అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి కౌంటింగ్ ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏ మాత్రం జాప్యం చేయొద్దని సూచించారు.
స్ట్రాంగ్రూమ్ల దగ్గర భద్రత కట్టుదిట్టం
జూన్ 4న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు స్ట్రాంగ్రూమ్ల దగ్గర మూడంచెలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్లో తెలిపా రు. ఏపీలో కొన్నిచోట్ల ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కేటాయించామని, పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సున్నిత మైన కేంద్రాలను గుర్తించడంతో పాటు, సమస్యలు సృష్టిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదు పులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నికల ఫలితాల రోజు ‘డ్రై డే’గా అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలను అమర్చామని, అభ్యర్థులు, వారి తరపున ప్రతిని ధులు రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్రూమ్లను పరిశీలించుకునేందుకు డెక్మెన్ హాలులో కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సున్నిత మైన ప్రాంతాలను గుర్తించి, ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. పల్నాడు జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.
పరికరాలను సిద్ధం చేసుకోవాలి
ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ల దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అంద జేసేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే శిక్షణ నివ్వాలని, సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈవీఎంలను భద్రపరచాలి
కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమపద్ద తిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ‘‘లెక్కింపు పూర్తి అయి నట్లుగా’’ ఆయా ఈవీఎంలపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి సురక్షితంగా భద్రపర్చాలని సూచించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ ఇటూ తరలించొ ద్దని, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపునకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్ల ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని సూచించారు.