– ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, మహానాడు: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, డ్రైనేజీ కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్ల నిధులు మంజూరైనట్టు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. ఇరిగేషన్…డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే రాము స్వగృహంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.నెహ్రాలి, మోటూరు ఛానల్, భూమికోడు తదితర కాల్వలు… డ్రైన్లలో జరగనున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే కు అధికారులు వివరించారు.
పూర్తి నాణ్యతతో కాలువల్లో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కాలువల్లో ఇటీవల జరిగిన పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తే సహించేది లేదని, బాధ్యతతో వర్కులు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులతో ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ..ఐదేళ్లుగా కాలువల్లో కూడిక తీత పనులు చెయ్యకపోవడంతో, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు.
రూ.6.03 కోట్లతో డ్రైనేజీలు, రూ.1.70 కోట్లతో ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులు జరుగునున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇరిగేషన్ డి.ఈలు భరత్, శ్రీను, డ్రైనేజీ డి.ఈ గణపతి, ఏఈలు కుమార్, అనిల్, బేగ్, తదితరులు పాల్గొన్నారు.