హైదరాబాద్, మహానాడు : ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి గురువారం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విఠల్రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.