గుంటూరు, మహానాడు: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సరస్వతీ శిశుమందిర్ జిల్లా అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు రాజకీయ విశేషాలను వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకు 12 రోజులు తీహార్ జైలులో ఉంచిన విషయాన్ని ఈ సంద ర్భంగా వనమా వివరించారు. ఎన్నో ప్రజా రంజక పథకాలను మోదీ నాయకత్వంలో అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనమా తనయులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.