టీడీపీలోకి వైసీపీ నేత మండవ పిచ్చయ్య

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామకు చెందిన మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త, వైసీపీ సీనియర్‌ నాయకుడు మండవ పిచ్చయ్య శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆయన చేరిక ముందు నందిగామ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సౌమ్యతో చర్చించారు. ఆరు రకాల పనులను ఆమె ముందు ఉంచారు. దానికి హామీ ఇవ్వటంతో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.