సీఎంపై దాడి కేసు సీబీఐకి అప్పగించాలి

గవర్నర్‌కు వర్ల రామయ్య వినతి

విజయవాడ, మహానాడు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన గులకరాయి దాడిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సోమవారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతిపత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, షరీఫ్‌, కొనకళ్ళ నారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, గాదె వెంకటేశ్వరరావు, విల్సన్‌ ఉన్నారు.