`అర్జున్ సినిమాలో పాత్రలను తలపించిన జగన్, భారతిరెడ్డి
` ప్రెస్మీట్లో డాక్టర్ వై.ఎస్.సునీతారెడ్డి చెప్పని నిజం ఇదే
` సీబీఐ పూర్తి దర్యాప్తు జరిపితే తేలేది ఇదే
` మిగిలిన వారందరూ పాత్రధారులే
` జగన్పై అభియోగాలను ఖండిరచాలంటే…
సీబీఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలి
` అజయ్ కల్లం వేసిన పిటిషన్…
త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చూడాలి
`ఆయన అర్జునుడు కాదు సైతాన్
`గులకరాయి డ్రామా బయటపడిరది
`నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు
నరసాపురం, మహానాడు : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డిల ప్రమేయం ఉందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలు గుదేశం నాయకుడు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో చెప్పని నిజం ఇదేనేమోనని నేను అనుకుంటున్నానని వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక జగన్, భారతిరెడ్డి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. సీబీఐ విచారణ పూర్తి అయితే ప్రస్తుతానికి సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి కూడా పాత్రధారిగా మారుతారన్నారు. ఆయన ప్రస్తుతానికి సూత్రధారి అని, పాత్రధారులుగా అప్రూవర్గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్లను గుర్తించడం జరిగిందన్నారు. నా దృష్టిలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్రెడ్డిలు కూడా పాత్రధారులేనని తెలిపారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వివేకా హత్య, సాక్షి దినపత్రిక లో తప్పుడు కథనాలు, డైవర్షన్ రాజకీయాలపై మాట్లాడారు.
అర్జున్ సినిమాలో పాత్రలను తలపించారు
మహేష్బాబు హీరోగా నటించిన అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్తో వచ్చిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత దంపతులు చాలా పవిత్రంగా ఉంటున్నట్టు నటిస్తూ హత్యలు చేయిస్తుంటారన్నారు. వారి జోడీతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరచూ పోలుస్తూ ఉంటారని తెలిపారు. ఆయన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నానని, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుందని వ్యాఖ్యానిం చారు. జగన్మోహన్ రెడ్డి తనపై మోపబడిన ఈ అభియోగాన్ని ఖండిరచాలనుకుంటే సీబీఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంరెడ్డి వేసిన పిటిషన్ విచారణ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్యోదంతంపై మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందం (సిట్) దర్యాప్తుపై మాకు నమ్మకం లేదని, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక విచారణ ముందుకు సాగకుండా అనేక అడ్డంకులు కల్పించారన్న ఆయన, ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తున్న అభిషేక్ మహంతి రాష్ట్రం విడిచి పారిపోయేలా ఇబ్బందులకు గురి చేశారన్నారు.
హత్యోదంతానికి ముందు కళ్లకు కట్టినట్లు వివరించిన సునీతారెడ్డి
వివేకా హత్యోదంతానికి ముందు జరిగిన సంఘటనలను ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మీడియా ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు వివరించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మంగమ్మ ముని మనవడే మన కథానాయకుడని, రెండవ పెళ్లి అంటే కయి, కైమని అరిచే జగన్మోహన్ రెడ్డికి ఆయన పుట్టుకనే నచ్చదేమో మనకు తెలియదన్నారు. వైఎస్ కుటుంబ వంశవృక్షం గురించి డాక్టర్ సునీతారెడ్డి తెలియజేస్తూ చిన్న కొండారెడ్డికి ఏడుగురు మగసంతానం, నలుగురు ఆడ సంతానమని తెలిపారు అన్నారు. అందులో భాస్కర్రెడ్డి ఆరవ వాడైతే, ఆయన కుమారుడే అవినాష్రెడ్డి అని తెలియజేసిందన్నారు. భాస్కర్ రెడ్డి సోదరి కుమార్తెనే భారతిరెడ్డి అని సునీత చెప్పారన్నారు. మంగమ్మ నాలుగో కుమారుడైన రాజారెడ్డికి రెండవ సంతానంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, మూడవ సంతానంగా వివేకానందరెడ్డి జన్మించారని తెలిపారన్నారు. వైఎస్ రాజారెడ్డి మొదటి కుమారుడైన జార్జి రెడ్డి మృతి చెందారని ఆయన కుమారుడే గడ్డం అనిల్రెడ్డి అని చెప్పారన్నారు. వివేకా హత్యకు నెలరోజుల ముందు సునీల్ యాదవ్, జయప్రకాశ్ రెడ్డి, గంగిరెడ్డి కలిసిమెలిసి అన్యోన్యంగా తీసుకున్న ఫొటోలను ప్రెస్మీట్లో ప్రదర్శించారని తెలిపారు. వైయస్ వివేకా హత్యకు వారం రోజుల ముందు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణను సీబీఐ సేకరించింది. తాము పంపుకున్న మెసేజ్లన్నీ గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుస్తాయని తెలియక సాక్షి దినపత్రిక బాధితులనే నిందితులుగా మార్చే విధంగా కథనాలు, హత్యకు గురైన వ్యక్తికి అక్రమ సంబంధాలను అంటగడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో యజమాని చెబితే రాశారో, చెప్పకపోయినా రాశారో తెలియదు కానీ, సాక్షి దినపత్రికలో అద్భుతంగా అబద్ధాలను వండడం జరిగిందన్నారు. రేపో, మాపో మళ్లీ అబద్ధాల కథనాలను వండివారుస్తారని తెలిపారు.
అవినాష్ ఫోన్ నుంచి హత్య రోజు వాట్సాప్ కాల్స్
హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి ఫోన్ నుంచి రాత్రి రెండు గంటల తరువాత అనేక ఫోన్లకు వాట్సాప్ కాల్స్ వెళ్లాయని ఆధారాలతో సునీత వివరించారని తెలిపారు. వాట్సాప్ను ఫేస్ బుక్ టేకోవర్ చేసిన తర్వాత ఫలానా ఫోన్ నుంచి, అవతలి వ్యక్తికి వాట్సాప్ కాల్ వెళ్లిందని గుర్తించవచ్చునన్నారు. ఆ సమయంలో ఎవరికి ఫోన్ కాల్ వెళ్లింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారని, తెలుసుకున్నారని కూడా చెప్పారు. అయితే ఆ విషయంలో అదృశ్య శక్తులు పని చేయడంతో పూర్తి సమాచారాన్ని చార్జిషీట్లో సీబీఐ పొందుపరచలేక పోయిందన్నారు. అప్పటికీ ఇంకా ఎన్నికల హడావిడి మొదలు కాలేదని, అభ్యర్థులను కూడా ఖరారు చేయలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్నికల కోసం మాట్లాడానని చెప్పడం అర్థరహితమన్నారు. హైదరాబాదులో రాష్ట్ర ప్రజలను ఎలా మోసగించాలన్న దానిపై జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రూపకల్పన కోసం లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులతో సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశం కొనసాగుతుండగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినట్లు పైనుంచి పిలుపు రావడంతో ఆయన అర్ధాంతరంగా సమావేశం నుంచి పై అంతస్తుకు వెళ్లి తిరిగి వచ్చి బాబాయి ఇకలేరు… చనిపోయారని అప్పుడే తనకు తెలిసినట్లుగా చెప్పడంతో అందరూ నిర్ఘాంత పోయి సమావేశాన్ని వాయిదా వేసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోయారన్నారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు అజయ్ కల్లం రెడ్డి పూసగుచ్చినట్లు వివరించారు. కానీ సీబీఐ అధికారులు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని ఆయన భావించలేదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ సంఘటనకు సంబంధించి కథనం వెలువడిన తర్వాత, తన మాటలను వక్రీకరించారని కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే సీబీఐ అధికారులు తాము రికార్డు చేసిన అజయ్ కల్లంరెడ్డి వాంగ్మూలం ఆడియో ను న్యాయస్థానం ముందు ఉంచారు. కేసు వేసిన వారే విచారణకు వచ్చినప్పుడల్లా వాయిదాలను కోరుతున్నారంటే దొంగ ఎవరు… హంతకులు ఎవరో తెలిసి పోలేదా? అని రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
ఆసుపత్రిలో తల్లిని చేర్పించి అరెస్టును అడ్డుకునేందుకు డ్రామాలు
వివేకా హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు వచ్చినప్పుడు ఆయన తల్లికి ఆరోగ్యం బాగాలేదని కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చేర్పించి డ్రామాలను ఆడారని తెలిపారు. ఆయన తల్లి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అరెస్టు ఎందుకు చేయలేదంటే సీబీఐ అధికారులు వెనక్కి వెళ్లారన్నారు. అవినాష్రెడ్డికి బెయిల్ వచ్చేవరకు వారు కాలయాపన చేశారని, అందరూ కలిసి అద్భుతమైన నటనను ప్రదర్శించారన్నారు. అవినాష్ రెడ్డికి బెయిల్ రాగానే, ఆయన తల్లికి ఆరోగ్యం కుదుటపడుతుందని, వైయస్ విమలారెడ్డి వచ్చి ప్రార్థనలు చేయగానే స్వాంతన చేకూరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు నోచుకోకుండా వాయిదాలు పడుతూ వస్తోందన్నారు. ఎన్నికల కేసుకు సంబంధించిన వాయిదాకు హాజరుకాని నేరానికి మాత్రం జయప్రదకు అరెస్టు వారెంట్ జారీ చేస్తారన్నారు. వ్యవస్థలోని అవస్థలు ఇవన్నీ అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, అవినాష్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది తెలియదన్నారు. హైకోర్టులో దస్తగిరి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారన్నారు. హైకోర్టులో కూడా తీర్పు వెలువడుతుం దని ఆశించినప్పటికీ, తీర్పు వెలువడడం లేదన్నారు. రేపో, మాపో దస్తగిరి పిటిషన్పై తీర్పు వెలువ డుతుందేమోనన్న ఆయన, పిటిషన్ కొట్టివేస్తారనే నేను అనుకుంటున్నానని చెప్పారు. హంతకులు అత్యంత బలవంతులు కనుక, కోర్టులో ఏమి జరుగుతుందోనని నేను అనుకుంటున్నానో నా అభిప్రా యాన్ని చెబుతున్నానని తెలిపారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సీబీఐ 1000 నుంచి 1500 కాగితాలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు.
సీబీఐ చార్జ్ షీట్లోని అక్షరాన్ని పొల్లు పోకుండా వివరించింది
హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లోని అక్షరాన్ని పొల్లు పోకుండా సునీతా రెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చెప్పాలనుకుని ఒక విషయం చెప్పలేదేమోనని అనిపిస్తుందన్నారు. సూత్రధారులు జగన్మోహన్రెడ్డి దంపతులేనని ఆమె వెల్లడిరచలేక పోయారన్నారు. సునీత చెప్పిన కథనం ప్రకారం వైఎస్ షర్మిలా రెడ్డి సీబీఐకి ఒక లేఖ రాశారని, తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవాలని కోరారన్నారు. షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్లో బెంగళూరులోని తన నివాసానికి వివేకా వచ్చి కలిసిన మాట నిజమేనని, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతానని నువ్వు కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరారు. ఎందుకు వద్దులే అని నేను వారిస్తుండగా పోటీ చేయమని ఒత్తిడి చేశారు. జగన్మోహన్రెడ్డి అడిగితే మాత్రం పోటీ చేయనని చెప్పవద్దని కోరిన ట్లు షర్మిల తెలిపారు. ఈ సన్నివేశాన్ని ఇటీవల విడుదలైన వివేకం సినిమాలోని రూపొందించడం జరిగిందన్నారు. గూగుల్ టేకౌట్స్, వాట్సాప్ కాల్స్, అజయ్ కల్లంరెడ్డి తడబాటు చూశాక… సీఐడీ మాజీ చీఫ్ సునీల్ అండ్ గ్యాంగ్ నన్ను కొడుతుంటే కళ్లారా చూసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా చూశారేమో అనిపిస్తుందన్నారు. ఎందుకంటే ఆయన హత్య జరిగిన తీరును జగన్మోహన్ రెడ్డి వర్ణించిన విధానం అనిర్వచనీయమన్నారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలను యధావిధిగా వివేకం సినిమా చూపెట్టారని గుర్తు చేశారు. ఒక సంఘటనను పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయకముందే, జగన్మోహన్ రెడ్డి దాని గురించి అంత చక్కగా వివరించారంటే… గతంలో నేను చెప్పినట్లుగా ఒకచోట జరిగిన సంఘటనను ప్రత్యక్షంగా చూడకపోయినా చెప్పగలిగే శక్తి భారతంలో సంజయుడుకి ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నదేమోనని ఎద్దేవా చేశారు. భగవద్గీత గురించి కూడా కళ్లు లేని ధృతరాష్ట్రుడికి కళ్లున్న సంజయుడు చెబితేనే రాసినట్లుగా వ్యాసుడి భారతంలో ఉన్నదన్నారు. జి.వి.డి.కృష్ణమోహన్ రాసిస్తే స్క్రిప్టు చదివినట్లుగా నేను చదవడం లేదని, నాకు చిన్ననాటి నుంచి రామాయణం, భారతం చదివి సముపార్జించిన జ్ఞానంతోనే మాట్లాడు తున్నానని తెలిపారు. వివేకా హత్యను నారాసుర రక్త చరిత్ర అని రాసి ఎవరిపైకో తోయాలని చూశా రు. చివరకు కూతురు అల్లుడే హత్య చేశారని, చనిపోయిన వివేకానందరెడ్డికి అక్రమ సంబంధం ఉన్నదని, రకరకాలుగా కేసును డైవర్ట్ చేయడానికి సాక్షి దినపత్రిక చేయని ప్రయత్నమంటూ లేదన్నారు.
ఒకటే గులకరాయి జగన్మోహన్రెడ్డికి, వెల్లంపల్లికి ఎలా తగిలింది?
ఒకటే గులకరాయి జగన్మోహన్ రెడ్డి నుదురుకు, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలిందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. నుదుటన చిన్నగా గీరుకపోతే 16 మంది వైద్యులు, 26 మంది నర్సుల బృందం చేత ఒళ్లంతా గుడ్డలు కట్టించుకోవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించిన ఆయన ఆ తరువాత చిన్న ప్లాస్టర్ వేసుకుని చిక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చారన్నారు. తగిలిన రాయి ఇంతవరకు దొరకలేదు… అది డ్రామా అని అందరికీ తెలుసు. రాయి తగిలిన చోట ఒక గుంట లా ఏర్పడి చుట్టూ ఉన్న ప్రాంతం కమిలిపోతుందని పలువురు వైద్యులతో మాట్లాడితే చెప్పారు. అంతేకానీ ఒకరికి తగిలిన రాయి వెళ్లి మరొకరి కంట్లో తగలదన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అసలు జరిగింది ఏమిటంటే…పెద్ద పెద్ద పూల దండలకు వై ఆకారంలో ఉండే వైర్లను చూడుతారని, దండ వేసే సమయంలో ఆ వైరు నుదురుకు గీరుకుపోయి ఉండవచ్చునని అన్నారు. అది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఆ సమయంలో లైట్లు తీసివేసి స్టోన్ డ్రామా క్రియేట్ చేయడానికి ముందే పథకం సిద్ధం చేసుకుని ఉంటారు. కోడి కత్తి డ్రామా మాదిరిగానే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటించారు. ఎవరైనా తమని తాము కొట్టుకుంటారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని, వీళ్లు నిజంగా కొట్టుకోలేదని, గులకరాయి స్టోరీ అల్లారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
భారతంలోని అర్జునుడు కాదు… బైబిల్లోని సైతాన్
భారతంలోని అర్జునుడు కాదని, బైబిల్లోని సైతాన్ జగన్మోహన్ రెడ్డి అని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి ఈ విషయాన్ని నాకు చెప్పారన్నారు. మే 13వ తేదీన మీకు ఓటు వేసి తిరిగి ఆస్ట్రేలియా వెళతాను రాజుగారు అని చెప్పారన్నారు. మే 14న నా పుట్టిన రోజని, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజని… ఆరోజు కాకుండా మే 15, 16వ తేదీ లో వెళ్లాలని నేను ఆయన్ని కోరడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తున్నారని, ఈ సందర్భంగా రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను నరికించి వేశారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వృక్ష హంతకుడిని, రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టిన వాడికి ప్రజలు ఓటు వేయవద్దని కోరారు.
ఇతరులపై బురద చల్లుతారా?
లక్షల కోట్ల ప్రజల సొమ్ములు తినేసి 36 కేసులు ఉన్న వారు ఇతరులపై బురద జల్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యపైనా సాక్షి దినపత్రికలో తప్పుడు కథనం రాయడం ఏమిటంటూ మండిపడ్డారు. ఇవాళ సాక్షి దినపత్రికలో నా గురించి రాసిన కథనంలో ఈడీ ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. గతంలోనూ సాక్షి దినపత్రిక ఇదే విధంగా వ్యవహరించిందని పేర్కొన్న ఆయన, ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా స్టే ఇచ్చినట్లుగా రాయలేదన్నారు. డాక్టర్ సునీతారెడ్డి ప్రెస్మీట్ను అన్ని దినపత్రికలు కవర్ చేస్తే సాక్షి దినపత్రికలో అక్షరం ముక్క కూడా రాయలేదని, ఇదెక్కడి ద్వంద వైఖరి అంటూ నిలదీశారు. నాపై ఫస్ట్ పేజీలో ఆ తరువాతి పేజీలో పెద్ద కథనాన్ని రాసి ఈడీ ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం గురించి ఎందుకు రాయవు రా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నించారు. సమాచార లోపం వల్లే తనకు నోటీసులు ఇచ్చిందన్న ఆయన, న్యాయం నా పక్కన ఉన్నది కాబట్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.
మద్యం వీరుడు జగన్మోహన్ రెడ్డి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అయితే మద్యం వీరుడు జగన్మోహన్ రెడ్డి అని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి నాణ్యత తగ్గించి ధరలను మూడు రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్త మాంసాలను దోచుకు తింటున్నారన్నారు. కేవలం తన సంక్షేమం, తన ఇద్దరు కూతుళ్ళ సంక్షేమం కోసం ప్రజల రక్తపు కూడు అలవాటు పడ్డారని, అడ్డగోలుగా దోచుకు తింటున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.