గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్‌

అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు
గల్ఫ్‌ వెళ్లే వారికి శిక్షణ ఇస్తామని వెల్లడి
కార్మిక సంఘాల నాయకులతో సమావేశం

హైదరాబాద్‌, మహానాడు : ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గల్ప్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. ప్రజా భవన్‌లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, సెప్టెంబర్‌ 17లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మాదని వెల్లడిరచారు. మంగళవారం గల్ఫ్‌ కార్మిక సంఘాల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావే శమయ్యారు.

ఆ దేశ విధానాలను స్పష్టంగా అధ్యయనం చేశాం

కార్మికుల హక్కులు కాపాడేందుకు ఫిలిప్పీన్‌ దేశమే ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతుంది. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేశాం. ఇప్పటికే గల్ఫ్‌ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్‌ తయారు చేశాం. ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వా నిస్తాం. పాలసీ డాక్యుమెంట్‌పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతామని వివరించారు. గల్ఫ్‌ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు

ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్‌ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాం. రైతు బీమాలాగే గల్ఫ్‌ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. మీ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు జీవన్‌ అన్నకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు నిజామాబాద్‌ పార్లమెంటులో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.