అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి
ఇన్సైడర్ ట్రేడిరగ్ అంటూ అబద్ధాల ప్రచారం
రాజకీయ లబ్ధి కోసం నాశనం చేశారు
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్
అమరావతి, మహానాడు : రాజధానిలో ఇన్సైడ్ ట్రేడిరగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారు. బుధవారం ఆయన రాజధాని ప్రాంతంలో పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. ఉద్ధండయాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. రాజధాని రైతులతో మాట్లాడారు. అనంతరం అక్కడ నిర్మాణాలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాజధానిలో ఐదు వేల టిడ్కో గృహాలు వృథాగా వదిలేశారని, రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్ ధ్వంసం చేశారని విమర్శించారు. ఆర్ 5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారని, బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని ఆరోపించారు. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. 20 వేల మంది సన్న, చిన్న కారు రైతులు భూములు ఇచ్చారని వివరించారు. రాజధానిలో 70 బహుళ అంతస్తుల భవనాలు వృథాగా వదిలేశారని, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని తెలిపారు. నిర్మాణాలు జరుగు తుంటే లక్ష మందికి పని దొరికేదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ స్మృతి వనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని కూడా నాశనం చేశారని, దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారని దుయ్యబట్టారు. రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందని, రాజధానికి ఖర్చు చేసిన పది వేల కోట్లు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి హృదయ విదారకమైన పరిస్థితి..ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని దుయ్యబట్టారు.