భార్య కొడుతుందని పోలీసుల ఎదుట భర్త గోడు

రక్షణ కల్పించాలని ఫిర్యాదు
పోలీసులు కేసు పెట్టడం లేదని ఆవేదన
ఇంటికి కూడా వెళ్లడం లేదని కన్నీరు

హైదరాబాద్‌, మహానాడు : తన భార్య రోజూ కొడుతుందని పోలీసుల ముందు గోడు భర్త గోడు వెళ్ల బోసుకున్నారు. తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంద ని రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. టెమూ జియన్‌ హైదరాబాద్‌లో మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా డు. అయితే పెళ్లయినప్పటి నుంచి తనను అకారణంగా హింసిస్తుందని, పలు మార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయినప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుం దని బాధితుడు ఆల్వాల్‌ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేయకపోవడంతో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడు చెప్పుకున్నాడు.

ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు వివ రించాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని, వెళితే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పిం చాలని బాధిత భర్త వేడుకున్నాడు.