డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పరీక్షల నిలిపివేత దారుణం

ఐదు నెలల్లోనే రేవంత్‌ అటకెక్కించారు
కేసీఆర్‌ హయాంలో అన్ని సేవలు అందించాయి
డయాగ్నోస్టిక్‌ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించండి
అన్ని రకాల వైద్యపరీక్షలు అందించేలా చూడాలి
ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండిరగ్‌ జీతాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభిం చిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటు లోకి తీసుకువచ్చి వైద్యసేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపం తో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించ లేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శన మని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరునెలల పెండిరగ్‌ జీతాలు వెం టనే చెల్లించాలని, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.