-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న పనులు
-ట్యాంక్బండ్పై స్టాల్స్, ప్రదర్శనలకు వేదికల తయారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జూలై 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాల్గొనేందుకు వచ్చే వారి కోసం దాదాపు 20 వేల మంది పట్టే భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నా రు. వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు, ప్రముఖులకు ఏ మాత్రం ఇబ్బందు లు లేకుండా చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి సౌకర్యాలు, టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లు, కార్యక్రమం లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు
జూన్ 2న సాయంత్రం ట్యాంక్బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్ని వాల్, బాణసంచా లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రు లు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలం గాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’పై జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ ఉంటుంది.
మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ ప్రదర్శన
ట్యాంక్బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఏర్పాటు చేశారు.