సకల శాఖల మంత్రి సజ్జలను ఎన్నికల సంఘం అరెస్టు చేయాలి

-అన్నం తింటున్నాడా… గడ్డి తింటున్నాడా..బుద్ధుందా?
-జగన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి డైరెక్షన్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
-ఓటమి భయంతో పోలింగ్‌ రోజున రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్రలు
-రిటర్నింగ్‌ అధికారులను కూడా బెదిరిస్తున్నారు
-ఓటమి ఖాయమవడంతో లండన్‌లో జగన్‌ రెడ్డి టీవీలు బద్దలుకొడుతున్నాడు
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ దేవినేని ఉమామహేశ్వరరావు

మంగళగిరి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సకలశాఖల మంత్రి సజ్జలను తక్షణమే ఎన్నికల సంఘం అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు కోరారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌ ఏజెం ట్లుగా తమకు అవసరం లేదన్న సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్‌ కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి డైరెక్షన్‌లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా డు. జవహర్‌ రెడ్డి సహకారంతో వీరి ఆటలు సాగుతున్నాయ్‌. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎస్‌ పదవికి మచ్చ తెచ్చిన జవహర్‌రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. సలహాదారుగా ప్రజల సొమ్ము తింటున్న సజ్జలకు బుద్ది ఉందా? ఐదేళ్లుగా రాష్ట్రా న్ని సర్వ నాశనం చేశారు. ఇప్పుడు ఓటమి భయంతో పోలింగ్‌ రోజున విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. రూల్స్‌ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ-జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గుచేటు. సజ్జల తినేది అన్నమా లేక గడ్డా? అసలు సజ్జలకు బుద్దుం దా? ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోమనకుండా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ఏడుస్తున్నాడు. రాష్ట్రానికి మీరు చేసిన నష్టం చాలదా? తప్పులు చేసినా కాపాడతామని భరోసా ఇస్తారా?

నోరు అదుపులో పెట్టుకోవాలి
సజ్జల మాటలను బట్టి చూస్తే వైసీపీకి చట్టం, ఎన్నికల సంఘం పట్ల ఉన్న గౌర వం ఏపాటిదో అర్థమవుతుంది. ఇలా చట్టాలను అతిక్రమించే వారిని ఉపేక్షించ కూడదు. సజ్జల నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటమి భయంతో కుట్రలు, కుతం త్రాలకు తెరలేపారు. పైగా వైసీపీ చీఫ్‌ ఏజెంట్లకు సజ్జల చేసిన హితబోధలను బ్లూ మీడియా పదేపదే ప్రసారం చేసింది. ఆయా యాజమాన్యలపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సజ్జల ఉల్లంఘిం చాడు.

రిటర్నింగ్‌ అధికారులను బెదిరిస్తున్నారు
తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు పలువురు రిటర్నింగ్‌ అధికారులను బెదిరిస్తున్నా రు. యర్రగొండపాలెం రిటర్నింగ్‌ అధికారిణి శ్రీలేఖను చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించాడు. మాకు రూల్స్‌ చెప్పకూడదు, అడ్డుపడకూడదని హెచ్చరిం చాడు. ఆర్వోను విధుల నుంచి తప్పించడాన్ని ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అత్యం త పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్‌ ప్రక్రియ రసాభాసగా జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని సచివాలయం వేదికగా మాట్లాడటం సిగ్గుచేటు. మరో వైపు ఓడిపోతామని అంచనాకు వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి లండన్‌లో టీవీలు బద్దలు కొడుతున్నాడు. పోలింగ్‌ రోజున అల్లర్లు చేయమని కేడర్‌ను రెచ్చగొడుతున్నాడు. నిబంధనలు పాటించని వైసీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర పగడ్భందీ చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరు తున్నాం. భవిష్యత్‌లో ఎవరూ ఇలా హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.