ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి మార్గం
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు: రామభక్త హనుమంతుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్ నగర్ లో ఆంజనేయ స్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ నగర్లో ప్రతి హనుమాన్ జయంతికి భక్తులకు అన్నసంతర్పణ చేయడం శుభసూచకమని అన్నారు. ఐకమత్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా భావితరాల వారికి భక్తి మార్గం చూపించిన వారం అవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి, ఆలయ కమిటీ సభ్యులు చలపాటి శ్రీను, జంపాన నరసింహారావు, జంపాన తేజ, ముసలయ్య, లంకె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.