ఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్‌ జరుగుతున్న వేళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలు శాంతియుతంగా జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రజల నిర్ణయాన్ని గౌరవించినందుకు వారు కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, వారి అవకాశాలపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అని పేర్కొన్నారు.