ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
– ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు
– ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు
– చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది
– ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు – ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి
– నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను
– నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు – కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు
– అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు
– ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను – ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది
– ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి – అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి
– ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి
– నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది
– ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా
– ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి : టీడీపీ అధినేత చంద్రబాబు