జయశంకర్ త్యాగాలు మరువ లేనివి

– కేసీఅర్.

హైదారాబాద్ జూన్21 మహానాడు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప జేసే దిశగా పాలన అందించిన నాడే వారికి ఘన నివాళి అర్పించినవారమవుతాం అని కేసీఅర్ తెలిపారు.