అమరావతి, మహానాడు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సచివాలయంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్స్ ను పటిష్ట పరచాలని, అన్ని రకాల పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని, స్టడీ సర్కిల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని మంత్రి సవితకు మెమోరాండం అందజేశారు.