నిండు నూరేళ్లూ.. చల్లగా..

-కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీస్సులు
-కుటుంబసభ్యుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుక

హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ లకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్ , మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు.