– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: తుపాను ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రేషన్ సకాలంలో అందించాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శానిటైజేషన్ రేషన్ సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు.
ఈ రాత్రికి వరద పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ శ్రేణులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా క్యాడర్ మొత్తం గా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులంతా అలర్ట్ గా ఉండి ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని సూచించారు.