దర్శి మండల సర్పంచ్ లు దాతృత్వం

– రూ. లక్ష విరాళం అందజేత
* అభినందించిన గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గంలోని రాజకీయాలకితీతంగా పలువురు సర్పంచులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని శుక్రవారం తన నివాసంలో కలుసుకొని వరద బాధితులకు మేము సైతం అంటూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మీ ద్వారా బాధితులకు అందే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి తమ ఆర్థిక సహాయ నిధిని అందజేయాలని కోరారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దాతృత్వంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. దర్శి అభివృద్ధికి కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

సాయం ప్రకటించిన సర్పంచ్ ల వివరాలు…

* జముకులదిన్నె సర్పంచ్ మర్రి సత్యన్నారాయణ – 30 వేలు
* కొత్తపల్లి సర్పంచ్ బట్టు రాము యాదవ్ – 10 వేలు
* బండి వెలిగండ్ల సర్పంచ్ కుమారుడు వర్నే కాశీ – 10 వేలు
* రాజంపల్లి సర్పంచ్ కుమారుడు వనం విజయ్ – 10 వేలు
* మారెడ్డిపల్లి సర్పంచ్ జడల పెద్దన్న – 10 వేలు
* వెంకటాచలం పల్లి సర్పంచ్ అంకాల శ్రీను – 5 వేలు
* బొట్లపాలెం సర్పంచ్ యలమంద – 5 వేలు
* వెంకటాపురం సర్పంచ్ ఆరేటి శ్రీను – 5 వేలు
* దేవవరం సర్పంచ్ కొర్నెలు -5 వేలు
* మరికొందరు సర్పంచ్ లు – 10 వేలు