ఫైనాన్స్‌ వ్యాపారి హత్య!

బాపట్ల, మహానాడు: బాపట్లలో ఫైనాన్స్‌ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రాజమండ్రి కి చెందిన వ్యక్తి బాపట్ల సూర్యలంక సముద్ర తీర ప్రాంతవాసులకు వారం వారం ఫైనాన్స్‌ ఇస్తుండేవాడు. ప్రతి సోమవారం బాపట్ల సూర్యలంక తీరం వద్ద ఉన్న షాపుల్లో డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి వస్తుంటాడు. ఎప్పటిలానే సోమవారం కూడా ఇక్కడకు వచ్చాడు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇస్తానని చెప్పి ఎదురుగా ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ అతనితో ఘర్షణపడి మెడ మీద కత్తితో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలకు గురైన ఆ ఫైనాన్స్‌ వ్యాపారి కర్చీఫ్ మెడకు చుట్టుకుని అక్కడ నుంచి సూర్యలంక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.