100 రోజుల పాలనలో ఎంతో ప్రగతి

బిజెపి ఎమ్మెల్యే లు

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.వివిధ రకాల సమస్యలు మా దృష్టికి తీసుకువస్తున్నారు.గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకి గురయ్యారు.

100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. 15 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ కారం.

రైతులకి తగిన న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

బుడమేరు వరద ఉదృతిలో నష్టపోయిన బాధితులని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.నష్టపోయిన బాధితులు, అలాగే రైతులకి తగిన న్యాయం చేస్తాం. రాజధాని ప్రాంతం వరదకి గురవుతాయాని విష ప్రచారం కొందరు చేస్తున్నారు.రాజధాని ప్రాంతంలో అలాంటి ఇబ్బందులు ఉండవు.

గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసారంటూ వైసీపీ పై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీ నివాస్, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.