సీసీఎస్‌ ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు
ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోం ది. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్‌ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహే శ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.