ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు
అమరావతి, మహానాడు : ఎన్నికల సంఘం అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపంతో హింసాత్మక దాడులు జరిగాయని, ఈ కారణంగా పోలింగ్ శాతం తగ్గినందువల్ల పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల అధికారికి వినతిపత్రం పంపించారు. వైసీపీ ఆగడాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.