Mahanaadu-Logo-PNG-Large

అక్షర శిల్పి రామోజీ

చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్‌, ప్రియా ఫుడ్స్‌, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనం లోని ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

కుటుంబ నేపథ్యం ఇదీ…

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామానికి చెందిన వారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.

బాల్యం, విద్యాభ్యాసం, వివాహం

రామోజీ కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచార వంతురాలు కావడంతో చిన్నతనంలో భక్తి, శుచి అలవడిరది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా ‘‘రామోజీ రావు’’ అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నాడు. రామోజీరా వు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్‌, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెంది న తాతినేని వెంకటసుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావ మరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్‌ హోటల్స్‌ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు.

శ్రద్ధాంజలి

వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫిలిం స్టూడియోను ఏర్పాటు చేసి తనదైన గుర్తింపు తెచ్చుకుని, జర్నలిజంలో ప్రజలను చైతన్యపరిచి, ఉదయాన్నే ఈనాడు పేపర్‌తో ప్రజలను పలకరించి అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్వర్గీయ చెరుకూరి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

ఓం శాంతి,
మల్లిన రాధాకృష్ణ,
తణుకు.