ఆంజనేయుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి

– ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలపై నిండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆ స్వామి వారిని ప్రార్థించారు. ఎమ్మెల్యే పట్టణ శ్రీ గుంటి ఆంజనేయస్వామి ఆలయంలో శరావోదయ వ్రతం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రపద మాసం, దశమి శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం ఇలా ఇవన్నీ ఒకే రోజు కలిసి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు నారాయణం చార్యులు తెలిపారు.

21 రకాల పూలతో స్వామివారికి విశేష ఆకు పూజతో పాటుగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆపకుండా స్వామివారికి అప్పాలతో నైవేద్యం సమర్పించినట్టు పేర్కొన్నారు. నైవేద్యం సమర్పణలో మహిళా భక్తులు విశేషంగా సేవలు అందించారని వివరించిన అర్చకులు ఇలా శరవోదయా వ్రతం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు కూడా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ చైర్మన్ చుండూరు శ్రీమన్నారాయణ తో పాటు ఎండోమెంట్ ఈవో హనుమంతురావులు వారి ఇరువురిని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.