Mahanaadu-Logo-PNG-Large

కూటమి విజయం ప్రజల గెలుపు

-రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక పాత్ర
-బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 90 శాతం అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కోసం ప్రజలు మద్దతు తెలిపారు. వికసిత భారత్‌లో వికసిత ఆంధ్రప్రదేశ్‌ భాగస్వామ్యం కావడం సంతోషం. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు అచంచల విశ్వాసాన్ని చాటారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అసమర్థ అవినీతి విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. రాష్ట్రంలో పార్టీ బలం చాలా గణనీయంగా పెరిగింది. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజల మద్దతుతో ఎన్డీఏ భారీ విజయం సాధించింది. గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని వ్యాఖ్యానించారు.