-కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
-అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి
-నాలుగు ఆవాసాల ప్రజలను తరలించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం
హైదరాబాద్: జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్ సమావేశమై చర్చించారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి లలో సైన్ బోర్డులు ఏర్పాటు, హైవే వెంట స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పిం చాలని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాస ముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత వార్థిక సంవత్సరంలోనే వినియోగిం చుకోవాలని అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని మైసమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ శాఖ అధికారు లను సీఎస్ కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పంచాతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, టీఎస్పీసీబీ సభ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.