అభిమానుల అపూర్వ స్వాగతం

రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్, అభిమానుల అపూర్వ స్వాగతం పలికారు. యువనేతకు స్వాగతం పలికేందుకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అభిమానుల తాకిడితో ఎయిర్ పోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మంత్రి లోకేష్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన బంగారుపాళ్యం బయలుదేరారు. దారి పొడవునా యువనేతను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు పెట్టారు.